బాలీవుడ్ నటుడు,దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ముగ్గురు టాప్ హీరోయిన్స్ని ఒకే తెరపై చూపించి ప్రేక్షకులకి పసందైన వినోదం అందించేందుకు సిద్ధమయ్యాడు. డాన్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టిన ఫర్హాన్ అక్తర్ జీ లే జరా అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించాడు. ఈ చిత్రం రోడ్ ట్రిప్ మూవీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుండగా, ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, అలియా భట్, కత్రినా కైఫ్ నటించనున్నారు.
సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ని ఓ వెరైటీ పోస్టర్తో ఇచ్చాడు ఫర్హాన్. భారత్ దేశంలోని అనేక ప్రదేశాలని కారు రూపంలో తయారు చేసినట్టుగా ఈ పోస్టర్ ఉంది. దిల్ చాహ్తా హై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం సంతోషంగా ఉంది. 2022లో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది. రోడ్ ట్రిప్లో పాల్గొనేందకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ఫర్హాన్ చెప్పుకొచ్చారు.
ఇక ప్రియాంక, అలియా, కత్రినా కైఫ్ కూడా తమ సోషల్ మీడియాలో పోస్టర్ షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండగా, అలియా భట్ తెలుగులో ఆర్ఆర్ఆర్ చేస్తూ హిందీలో బ్రహ్మాస్త్రా వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఇక కత్రినాకు ఈ మధ్య చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ రావడం లేదు. ఫర్హాన్ అక్తర్ సినిమా మంచి ప్రాజెక్ట్స్ అవుతుందని ఈ ముద్దుగుమ్మ భావిస్తుంది.