హైదరాబాద్, ఆట ప్రతినిధి: జవహర్లాల్ నెహ్రూ 57వ జాతీయ సీనియర్ హాకీ టోర్నీలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్లో ఇండియన్ రైల్వేస్ జట్టు 7-3 తేడాతో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్పై ఘన విజయం సాధించింది. మ్యాచ్లో ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రైల్వేస్..వరుస గోల్స్తో విజృంభించింది. రైల్వేస్ తరఫున అజయ్ యాదవ్(22ని, 53ని), పర్దీప్సింగ్(27ని, 32ని) డబుల్ గోల్స్తో ఆకట్టుకోగా, ముకుల్శర్మ(20ని), అర్జున్శర్మ(42ని), శేషెగౌడ(45ని) రాణించారు. అంతకుముందు జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ 6-0 తేడాతో హైదరాబాద్ ఎలెవన్పై భారీ గెలుపు అందుకుంది.