‘విరామానికి కూడా ఎక్కడో ఓ చోట ముగింపు పలకాలి. ఎడతెగని విరామ సమయం మనుషుల్లో నిస్తేజాన్ని తీసుకొస్తుంది. అందుకే అర్జెంట్గా కెమెరా ముందుకెళ్లాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది అగ్ర కథానాయిక పూజా హెగ్డే. కరోనా థర్డ్వేవ్ ప్రభావంతో గత కొంతకాలంగా పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దీంతో చాలామంది తారలు ఇంటికే పరిమితమైపోయారు. అయితే ఈ సుదీర్ఘ విశ్రాంతి వల్ల తాను బోర్గా ఫీలవుతున్నానని చెప్పింది పూజాహెగ్డే. ఈ మధ్యే వరుస విహారయాత్రలతో ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందీ భామ. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఈ సొగసరి తన తదుపరి సినిమాల షూటింగ్స్కు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ చేసింది. ‘త్వరలో సెట్స్లో అడుగుపెట్టాలి. సోషల్మీడియాలో ఫిల్టర్స్ వేసుకొని చేసే ఎంటర్టైన్మెంట్ నాకు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వడం లేదు’ అని ఇన్స్టా స్టోరీలో పూజాహెగ్డే పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నది.