మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 1 : కాలనీలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన సివరేజ్ పైప్లైన్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ పట్టణంలో రూ.7 కోట్లతో చేపట్టిన సివరేజ్ పైప్లైన్ పనులను మంత్రి పరిశీలించారు.
భారీ వర్షాలతో నీట మునిగిన కాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. కాలనీలు ముంపునకు గురికాకుండా చేపట్టిన సివరేజ్ పైప్లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, పనులు పూర్తి అయితే ముంపు సమస్య ఉండదని తెలిపారు.
ప్రభుత్వం రోడ్లు, మురికి కాలువల అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయిస్తుందన్నారు.
నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో ఉన్న లింకు రోడ్ల విస్తరణకు కోట్ల రూపాయిలు కేటాయిందని చెప్పారు. అంతకు ముందు దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి సహకారంతో విద్యార్ధులకు మంత్రి మల్లారెడ్డి నోటు బుక్లను అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ స్వామి, కీసర మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, దమ్మాయిగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.