అధికారిక, శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై నోరు మెదపని అర్వింద్
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై చేతులెత్తేసిన ఎంపీ
స్పైసెస్ బోర్డు పాలకవర్గం కూర్పులోనూ కనిపించని చొరవ
ఆంధ్రా నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు చోటు
తెలంగాణ ఎంపీలకు చోటు కల్పించడంలో కేంద్ర సర్కారు వివక్ష
నిజామాబాద్, మార్చి 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపుబోర్డు ఏర్పాటుపై గుడ్లు తేలేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పదవికి రాజీనామా చేయాలంటూ రైతుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దీంతోపాటు తానిచ్చిన హామీని తమ ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో ఆయనకు ఎటూ పాలుపోవడంలేదు. పసుపు బోర్డు వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు 2017లోనే ప్రతిపాదించిన స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కమ్ రీజినల్ సెంటర్ ఏర్పాటును తన ఖాతాలో ఎంపీ అర్వింద్ వేసుకుంటున్నారు. ఈ సెంటర్తో ఎలాంటి ప్ర యోజనం లేకున్నా ప్రగల్భాలు పలుకుతున్నారు. పసు పు రైతులకు లాభాలు జరుగుతాయంటూ చెప్పుకొస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చి కేంద్రంగా పని చేస్తున్న స్పైసెస్ బోర్డుకు 32 మంది సభ్యులతో కూడిన పాలకవర్గం ఉంటుంది. ఇందులో లోక్సభ, రాజ్యసభ సభ్యులకు, సుగంధ ద్రవ్యాల ఎగుమతి, దిగుమతిదారులు, రైతులు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. వీరి పదవీ కాలం మూడేండ్లు. అర్వింద్ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన త ర్వాత పాలక వర్గం కూర్పు జరిగింది. ఇందులో పసుపు పంట పండిస్తున్న ప్రాంతాల నుంచి ఒక్కరికీ చోటు లేదు. పైగా 2020 జనవరిలో ఆంధ్రా ప్రాంతం నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుకు స్థానం కల్పించారు. తెలంగాణ ఎంపీలకు మాత్రం మొండి చేయి చూపించారు. స్పైసెస్ బోర్డుకు సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక, అధికారిక సమాచారంపై ఏనా డూ మాట్లాడని ఎంపీ అర్వింద్.. పదే పదే రెచ్చగొట్టే ప్రసంగాలకే పరిమితం కావడంపై పసుపు రైతులు మండిపడుతున్నారు.
అర్వింద్ నీ ఘనకార్యం ఎక్కడా?
స్పైసెస్ బోర్డుపై అరచేతిలో స్వర్గం చూపిస్తున్న ఎంపీ అర్వింద్కు పసుపు రైతులు రోజుకొక సవాల్ను విసురుతున్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు పాలకవర్గంలో తెలంగాణ ప్రాంతానికి ఎందుకు ప్రాధాన్యత దక్కలేదో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 2018లో యూపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన ఏపీకి చెందిన బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావుకు 2020, జనవరిలో కేంద్రం నేరుగా స్పైసెస్ బోర్డులో సభ్యత్వం కల్పించింది. ఉత్తరాదికి ప్రాతినిథ్యం వహించే ఆయనకు చోటు దక్కగా తెలంగాణ ప్రాంతం నుంచి ఏ ఒక్క ఎంపీకి స్థా నం లేకుండా పోయింది. వాస్తవానికి స్పైసెస్ బోర్డు ద్వారా పసుపు రైతులకు మేలు చేకూరుతుందని అనుకుంటే పసుపు పంట విస్తారంగా సాగవుతున్న ప్రాంతాల నుంచి రైతులకు చోటు ఇవ్వాలి కదా? అంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అదీగాక లోక్సభ సభ్యుల కోటా నుంచి ఇద్దరికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ నుంచి ఏ ఒక్క ఎంపీకి ఎందుకు