తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అందులో భాగంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు హోమం, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి,టెంపుల్ ఇన్స్పెక్టర్లు రెడ్డిశేఖర్, శ్రీనివాస నాయక్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.