పాట్నా: కరోనా నేపథ్యంలో కోర్టు విచారణలు ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది లైవ్ సెషన్ను గమనించక భోజనం చేయడంలో బిజీ అయ్యారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందించిన తీరు నవ్వులు పూయించింది. బీహార్లోని పాట్నా హైకోర్టు న్యాయవాది క్షత్రశల్ రాజ్ శుక్రవారం ఆన్లైన్ కోర్టు విచారణలో పాల్గొన్నారు. కొంత సేపటి తర్వాత ఆయన భోజనం చేయసాగారు. అయితే తాను ఆన్లైన్ సెషన్లో లైవ్లో ఉన్న విషయం మరిచిపోయారు.
మరోవైపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఈ ఆన్లైన్ కోర్టు సెషన్లో పాల్గొన్నారు. న్యాయవాది రాజ్ లైవ్లో భోజనం చేస్తున్న విషయాన్ని గమనించి ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. తనకు కూడా భోజనం పంపమని నవ్వుతూ అడిగారు. దీంతో కంగారుపడిన ఆ న్యాయవాది తన భోజనం ప్లేట్ను పక్కనపెట్టారు. మయూర్ సెజ్పాల్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ పోస్ట్ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.