న్యూఢిల్లీ: ప్రపంచ పారా పవర్లిఫ్టింగ్ టోర్నీలో పరమ్జీత్ కుమార్(49 కేజీలు) కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. పారా పవర్లిఫ్టింగ్లో తొలి పతకం సాధించిన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. జార్జియా వేదికగా జరిగిన ప్రపంచ సీనియర్ పారాలిఫ్టింగ్ చాంపియన్షిప్ పురుషుల 49 కిలోల విభాగంలో పోటీ పడిన పరమ్జీత్ 158 కిలోలు ఎత్తి ఔరా అనిపించాడు. మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ముద్దాడిన పరమ్జీత్ను.. పారాలింపిక్స్ కమిటీ భారత అధ్యక్షురాలు దీపా మాలిక్, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) అభినందించాయి.