హైదరాబాద్: ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్లో ఉస్మానియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో ఉస్మానియా పురుషుల జట్టు 3-0 తేడాతో ఎస్వీ యూనివర్సిటీ(తిరుపతి)పై అద్భుత విజయం సాధించింది. తొలుత జరిగిన పురుషుల సింగిల్స్లో ఉస్మానియా కెప్టెన్ సాయికార్తీక్ రెడ్డి 6-2, 6-0 తేడాతో సాయిరాంపై అలవోకగా గెలిచాడు. అదే జోరులో సుహిత్రెడ్డి 5-7, 6-2, 6-2తో శివదీప్ కొసరాజును ఓడించాడు. డబుల్స్లో ఉస్మానియా ద్వయం సాయికార్తీక్, సుహిత్రెడ్డి 6-4, 1-6, 6-1తో శివదీప్, రోహిత్ జోడీపై విజయం సాధించింది.