చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో మరో 5G స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. ఒప్పో రెనో 5 సిరీస్లో 5Z పేరుతో కొత్త ఫోన్ను యూఏఈతో పాటు సింగపూర్లో లాంచ్ చేసింది. 48 మెగా పిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా, 30W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. కేవలం 5 నిమిషాల చార్జింగ్తో 2.9 గంటల కాలింగ్ను చేసుకోవచ్చు.
ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెనో 5Z స్మార్ట్ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.29,300గా ఉంది. ఈ ఫోన్ కాస్మో బ్లూ, ఫ్లూయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఒప్పో రెనో 5 జెడ్ ఫోన్ గత నెలలో భారత్లో విడుదలైన ఒప్పో ఎఫ్ 19 ప్రొ+ 5జీ రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి.
డిస్ప్లే: 6.40 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 800U
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 48+8+2+2 మెగా పిక్సెల్
ర్యామ్:8జీబీ
స్టోరేజ్:128జీబీ
బ్యాటరీ కెపాసిటీ:4310mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11