మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 6: పిల్లల రక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగాల ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ను విజయవంతం చేయాలన్నారు. రెస్క్యూ చేసిన పిల్లలకు కొవిడ్-19 పరీక్షలు చేయించాలన్నారు. సమావేశంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి ఉదయశ్రీ, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఇంతియాజ్, రెహమాన్, లేబర్ ఆఫీసర్ ప్రభావతి, మెడికల్ ఆఫీసర్ రామ్కుమార్, చైల్డ్లైన్ 1098 కో-ఆర్డినేటర్ ప్రేమ్కుమార్, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.