న్యూఢిల్లీ: భారత సెయిలర్ నేత్ర కుమానన్.. గ్రాన్ కెనరియా సెయిలింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం చేజిక్కించుకుంది. స్పెయిన్ వేదికగా గురువారం జరిగిన టోర్నీ లేజర్ రేడియల్ విభాగంలో బరిలోకి దిగిన 24 ఏండ్ల నేత్ర.. ఆరు రేసులకు గాను మూడింట అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం పట్టింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన నేత్ర.. 20 మంది సెయిలర్లు పాల్గొన్న ఈ యూరోపియన్ రీజినల్ ఓపెన్ టోర్నీలో సత్తాచాటింది. బెనెటో లాంచో (స్పెయిన్), మార్టీనా రియోనో చాచో (స్పెయిన్) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.