వ్యవసాయ యూనివర్సిటీ : వ్యవసాయ రంగం అభివృద్ధికి మానవ వసనరులు ఎంతో అవసరమని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మ్యానేజ్మెంట్ (నార్మ్) చేస్తున్న కృషి అభినందించదగినదని, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఎఆర్)డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అగ్రికల్చర్ ఎడ్యూకేషన్) డా. రమేష్చంద్ అగర్వాల్ అన్నారు. బుదవారం నార్మ్ 46వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ ఆధారిత రంగాలలో నామ్ సేవలు అభినందనీయమన్నారు.
దేశంలో ప్రస్తుతం రూ .70 వేల కోట్ల విలువచేసే వివిద వంటనూనెలను దిగుమతులు చేసుకుంటున్నామని, దానిని తగ్గించడానికి నిరుపయోగంగా ఉన్న 26 మిలియన్ హెక్టార్ల భూమిలో నూనె గింజల పంట సాగు ను చేపట్టడానికి ప్రణాళిక సిద్దం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ భ్యాంక్ నిధులతో చేపట్టిన నేషనల్ అగ్రికల్చరల్ హైయర్ ఎడ్యూకేషన్ ప్రాజెక్టుకు (ఎన్ఎహెచ్ఈపీ) నార్మ్ నోడల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ గా గుర్తించ బడిందని దేశ అభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టడానికి ముందుండాలన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ప్రస్తుత పరిస్థితులలో ఐసీఏఆర్-చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
నార్మ్ 46 ఏళ్ల ప్రగతి దేశ వ్యవసాయ రంగ పాలసీలను తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. మరో నాలుగేళ్లలో దేశంలో అగ్రగామి సంస్థగా అభివృద్ధి చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నార్మ్లో హెర్భల్ గార్డెన్ , ల్యాంగ్స్కేపింగ్ తోపాటు స్సోర్ట్స్ కాంప్లెక్స్స్ టెక్నాలజీ పార్కుల ఏర్పాట్లను ఆర్సీ అగర్వాల్ అభినందించారు. ఐసీఏఆర్లోని వివిద వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఈ విధంగా టెక్నాలజీ మోడల్ పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 20 వైస్ చాన్స్లర్ల సమావేశాలు ఇక్కడే జరుగనున్నాయని , దేశంలోని వైస్ చాన్స్లర్లందరూ ఇక్కడికి రానున్నారన్నారు. బాధ్యతాయుతమైన వ్యవసాయ విద్య మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
నార్మ్ డైరెక్టర్ డా. సిహెచ్ శ్రీనివాస రావు మాట్లాడుతూ ఏడాది కాలంలో నార్మ్లో అనేక కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ విద్య , శిక్షణ , పరిశోధన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు .కొవిడ్ కాలంలోనూ అగ్రి కల్చర్ రీసెర్చ్సర్వీసుల్లో నియమితులైన శాస్త్రవేత్తలకు ఇచ్చే ఫౌండేషన్ కోర్సును చేపట్టి అందరి మన్ననలు పొందామన్నారు. గత ఏడాది 12 వేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. వ్యవసాయ విద్య ,పరిశోధన, పాలన పరమైన అంశాలు , అగ్రి ఇంకిబేషన్ సెంటర్ ద్వారా అభివృద్ది లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు .కార్యక్రమంలో ఏడిజీ (హెచ్ఆర్డి) డా. సీమబగ్గీ , వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు.