యూపీఎస్సీ పరీక్ష ద్వారా ఎంపికై, హైదరాబాద్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో శిక్షణ పూర్తిచేసుకున్న 62 మంది సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లకు శుక్రవారం దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, అన్ని రకాల అత్యాధునిక ఆయుధాల వాడకం వంటి అంశాల్లో వీరు శిక్షణ పొందారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మయాంక్సింగ్, విశ్వరాజ్ భూషన్, కమల్అతిథ్ ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమానికి క్యాడెట్ల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు హాజరై అభినందించారు. ఈ సందర్భంగా ఒక అసిస్టెంట్ కమాండెంట్ తన తల్లికి టోపీని అలకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
– హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)