ఇప్పుడు దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తక్కువ సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు తమిళ హీరో శింబు నటించిన ఈశ్వరన్ సినిమాతో కోలీవుడ్కు కూడా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో నిధి నటన చూసి ఫిదా అయిన తమిళ దర్శకులు వరుస ఆఫర్లు ఇస్తున్నారట. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయని సమాచారం. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులపై స్పష్టత రానుంది.