సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)/మారేడ్పల్లి: తెలంగాణ – బంగ్లాదేశ్ మధ్య పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోవాలని బంగ్లాదేశ్ హై కమిషనర్ షెల్లీ సలేహిన్ అన్నారు. గురువారం రీజినల్ పాస్పోర్టు అధికారి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి దాసరి బాలయ్యతో కలిసి దౌత్యపరమైన అంశాలపై చర్చించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బ్రాంచ్ సెక్రటేరియట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రతినిధి బృందానికి సౌకర్యాలు కల్పిస్తున్నదని బాలయ్య పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటేరియట్ నుంచి డిప్యూటీ సెక్రటరీ బి.శ్రీనివాసులు, సెక్షన్ ఆఫీసర్ విక్రమ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.