భోపాల్: ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు ఒక స్వీట్ షాపు యజమాని చొరవచూపాడు. ఉదయం వేళ ఓటు వేసిన వారికి పోహా, జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు. మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. (Madhya Pradesh Assembly Polls) ఈ నేపథ్యంలో ఓటర్లను ఉత్సాహపరిచేందుకు ఇండోర్కు చెందిన ఒక స్వీట్ షాప్ ఓనర్ ప్రయత్నించాడు. ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల మధ్య ఓటు హక్కు వినియోగించుకున్న వారికి పోహా, జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు. వేలిపై సిరా మార్క్ చూపించిన వారికి వీటిని అందజేశాడు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ నమోదవుతుందని తాను భావిస్తున్నట్లు స్వీట్ షాప్ ఓనర్ శ్యామ్ శర్మ తెలిపాడు. అందుకే ఉదయం 6 నుంచి 9.30 గంటల వరకు పోహా, జిలేబీ ఉచిత పంపిణీ కోసం ఏర్పాట్లు చేసినట్లు చెప్పాడు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించారని కొనియాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#MadhyaPradesh putting a delicious twist on democracy! Free #Poha for early voters in Indore, turning election day into a breakfast celebration. A tasty incentive to encourage civic participation! https://t.co/RMxoDqyya2
— Zaitra (@Zaitra6) November 17, 2023