లక్నో : ఓ పదిహేను ఏండ్ల పిల్లాడితో ముగ్గురు పిల్లల తల్లి పరారీ అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని ఓ గ్రామంలో ఈ నెల 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కంపియాగంజ్ ఏరియాకు చెందిన ఓ వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న విద్యార్థితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ అబ్బాయితో ఆమె సన్నిహితంగా మెలిగింది. ఇక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ పిల్లాడిని తీసుకుని వివాహిత ఈ నెల 10న అదృశ్యమైంది. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.