న్యూఢిల్లీ: కరోనా వైరస్ అన్నిరంగాలపై ప్రభావం చూపినట్టుగానే బ్యాంకింగ్ రంగానికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇప్పటివరకు వెయ్యిమందికి పైగా కోవిడ్ కు బలయ్యారు. అంతకన్నా ఎన్నోరెట్లు జబ్బుపడ్డారు. బ్యాంకు ఉద్యోగులు కూడా ఫ్రంట్లైన్ వర్కర్స్ కిందకు వస్తారని, వారిని కూడా వైరస్ వెంటాడుతున్నదని బ్యాంకు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజన్ మీడియాతో అన్నారు. కాగా 1200 మంది వరకు కరోనతో చనిపోయి ఉంటారని అఖిలభారత బ్యాంకు అద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఉద్యోగుల పరిహారం చెల్లింపు విధానాలపై అన్ని బ్యాంకులు వివరాలు వెల్లడించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులకు ప్రాధాన్యతపై కరోనా టీకాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సీనియర్ దేబాశిష్ పాండా సూచించారు.