హైదరాబాద్: నగరంలో ఆరేండ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దారుణమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి అన్నారు. నిందితుడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేయాల్సిందేనని చెప్పారు. సమాజంలో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు.