భైంసాటౌన్, నవంబర్ 27: నిర్మల్ జిల్లాలో మధ్యరాతియుగం ఆనవాళ్లు లభించాయి. వానల్పాడ్ ఎల్లమ్మగుట్టపై రాతి పరికరాలు లభ్యమైనట్టు భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకుడు కట్కం మురళి తెలిపారు. శనివారం ఆయనతోపాటు అధ్యాపకులు సూర్యసాగర్, అర్చన, జీ సుభాష్, ఆరె రాజు వాటిని పరిశీలించారు. అవి మధ్యరాతియుగం నాటివని, ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెరలో ఆదిమానవుల రాతి పరికరాల పరిశ్రమ ఉండేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.