స్టార్ హీరో, ప్రతిష్టాత్మక సినిమా, భారీ బడ్జెట్…ఇందులో ఒక కొత్త నాయికకు అవకాశం దక్కితే. గొప్ప అదృష్టమే అంటారంతా. అలాంటి ఛాన్స్ కొట్టేసింది మానుషీ చిల్లర్. 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ..అక్షయ్ కుమార్ సరసన ‘పృథ్వీరాజ్’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంలో రాకుమారి సన్యోగితా పాత్రలో నటిస్తున్నదామె. ఇటీవల ట్రైలర్ విడుదలైంది. ఆమె మాట్లాడుతూ…‘తొలి చిత్రంతోనే ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాలో నాయికగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. దీన్నొక బాధ్యతగా తీసుకొని ఈ పాత్రలో మెప్పించేందుకు వందశాతం ప్రయత్నించా. రాకుమారి సన్యోగితా పాత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అని చెప్పింది. ‘పృథ్వీరాజ్’ మూవీతో పాటు ‘గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ అనే మరో చిత్రంలో నటిస్తున్నదీ తార.