టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని సర్కారు ప్రకటన
ఉమ్మడి జిల్లాలో 1,967 పోస్టులు ఖాళీ
ఆదిలాబాద్, మార్చి 25 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితం గా అందజేస్తున్నది. సన్నబియ్యంతో భోజనం, పౌష్టికాహ రం పెడుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిపోయింది.
ఉమ్మడి జిల్లాలో 1967 ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీ
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేపడుతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులు భర్తీ కానున్నాయి. ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లాలో 1967 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో 459 పోస్టులు, నిర్మల్లో 480, మంచిర్యాలలో 354, కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలో 674 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్జీటీలు 834, స్కూల్ అసిస్టెంట్లు 674, పీజీహెచ్ఎంలు 183, ప్రైమరీహెచ్ఎంలు 187, పండితులు 77, పీఈటీలు 12 ఖాళీగా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఎస్జీటీలు 174, నిర్మల్లో 199, మంచిర్యాలలో 107, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 354, ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు 172, నిర్మల్లో 167, మంచిర్యాలలో 153, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 182, పీజీహెచ్ఎంలు ఆదిలాబాద్ జిల్లాలో 50, నిర్మల్లో 59, మంచిర్యాలలో 39, కుమ్రంభీ, ఆసిఫాబాద్లో 35, ప్రైమరీ హెచ్ఎంలు ఆదిలాబాద్ జిల్లాలో 46, నిర్మల్లో 48, మంచిర్యాలలో 34, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 59, పండితులు ఆదిలాబాద్ జిల్లాలో 15, నిర్మల్ జిల్లాలో 5, మంచిర్యాలలో 17, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 40, పీఈటీలు ఆదిలాబాద్ జిల్లాలో 2 పోస్టులు, నిర్మల్లో 2, మంచిర్యాలలో 2, ఆసిఫాబాద్లో 4 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టనున్న ఉపాధ్యాయుల నియామక ప్రక్రియతో ఖాళీలు భర్తీకావడంతో పాటు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు లభిస్తాయి. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది.