కోల్కతా: బెంగాల్ ప్రజలు దుర్గాపూజను ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే ఆ దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు ఇచ్చింది. ఇటీవల సాంస్కృతిక వారసత్వ గుర్తింపును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు. దుర్గాపూజకు చెందిన సుమారు వెయ్యి కమిటీల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నార్త్ కోల్కతాలోని జొరసాంకో ప్రాంతంలో ఈ ర్యాలీ జరిగింది. టీఎంసీ నేత మమతా నేతృత్వంలో జరిగిన ర్యాలీలో ఆ పార్టీ కీలక నేతలు కూడా పాల్గొన్నారు. దుర్గాపూజకు ఐసీహెచ్ ట్యాగ్ ఇచ్చినందుకు యునెస్కోకు ధన్యవాదాలు చెబుతున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. నెల రోజుల ముందు నుంచే పండగ సంబరాలు మొదలయ్యాయని, అందరూ ర్యాలీలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.