అభినవ్ మణికంఠ, గోల్డీనిస్సీ, మ్యాడీ విజే, పవన్మ్రేష్, భరత్రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహానటులు’. అశోక్ రెడ్డి దర్శకుడు. అనిల్ బొడ్డిరెడ్డి, తిరుపతి యర్రంరెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర పోస్టర్, పాత్రల పరిచయం కార్యక్రమం గురువారం జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ “జాతిరత్నాలు’ జోనర్లో సాగే చిత్రమిది. ఆద్యంతం వినోదంతో అలరిస్తుంది. ఓ నలుగురు యువకులు కలిసి మహానటులు అనే యూట్యూబ్ ఛానెల్ను ఎలా తయారుచేశారన్నదే చిత్ర కథ’ అన్నారు. నూతన ప్రతిభను పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ బ్యానర్గా ప్రారంభించామని నిర్మాతలు తెలిపారు. సినిమాలో నాలుగుపాటలుంటాయని సంగీత దర్శకుడు మార్కస్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం నరేష్, కథ, మాటలు: పి.సుధీర్వర్మ.