సూపర్ స్టార్ మాధవన్కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడే తన ట్వీట్ ద్వారా చెప్పాడు. అయితే అందరిలాగా మామూలుగా కాకుండా కాస్త ఫన్నీ ట్వీట్తో తనకు కొవిడ్ పాజిటివ్గా తేలిందన్న విషయాన్ని మాధవన్ చెప్పడం విశేషం. ఎప్పుడో పదకొండేళ్ల కిందట వచ్చిన త్రీ ఇడియట్స్ మూవీని గుర్తు చేస్తూ అతను ఈ ట్వీట్ చేశాడు. ఆ మూవీలో మాధవన్తోపాటు ఆమిర్ఖాన్, షర్మాన్ జోషి కూడా నటించిన విషయం తెలిసిందే. పర్హాన్ క్యారెక్టర్లో మాధవన్, రాంచోగా ఆమిర్ఖాన్, రాజుగా షర్మాన్ కనిపించారు. ఇక వైరస్ క్యారెక్టర్లో బొమన్ ఇరానీ జీవించేశాడు. ఇప్పుడీ క్యారెక్టర్లన్నింటినీ గుర్తు చేస్తూ మాధవన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆమిర్ ఖాన్కు కరోనా సోకిన సంగతి తెలుసు కదా. ఫర్హాన్.. రాంచోని ఫాలో కావాల్సిందే. వైరస్ ఎప్పుడూ మా వెంటే పడేవాడు. కానీ ఈసారి దొరికిపోయాం. కానీ అంతా బాగానే ఉంది. కొవిడ్ తొందర్లోనే పోతుంది. కనీసం ఇక్కడైనా రాజు (షర్మాన్ జోషి) మమ్మల్ని ఫాలో అవకూడదని అనుకుంటున్నాను అని మాధవన్ ట్వీట్ చేశాడు.