వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావు, అయేషాఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముఖచిత్రం’. గంగాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించారు. ఎస్కేఎన్ సమర్పకుడు. గురువారం టీజర్ను యువహీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నలుగురు యువతీయువకుల జీవితానికి ముఖచిత్రమిది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు’ అన్నారు. సమాజంలోని ఓ బలమైన అంశాన్ని తీసుకొని ఈ సినిమాను రూపొందించామని చిత్ర సమర్పకుడు ఎస్కేఎన్ తెలిపారు. కథాబలమున్న సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వ్యక్తం చేశారు.