అమరావతి: లేపాక్షి, హస్త కళాకృతులు సహా ఆప్కో వస్త్రాల అమ్మకాలను పెంచేందుకు బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను చేనేత, జౌళిశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా బ్రాండింగ్, బ్రాండ్ అంబాసిడర్ ఉండాలన్నారు. రెండేండ్లకోసారి బ్రాండ్ అంబాసిడర్ను మార్చే విధానం పైనా ఆలోచన చేయాలని సూచించారు. లేపాక్షి కళారూపాలు, చేనేత వస్త్రాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా విక్రయించాలని చెప్పారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో చేనేత, జౌళి శాఖపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు.