న్యూఢిల్లీ: మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్తో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. జూన్ 14వ తేదీన డేటింగ్ ప్రకటన చేసిన లలిత్ మోదీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. సుస్మితాతో లలిత్ బ్రేకప్ అయినట్లు రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ ఇంటిమేట్గా ఉన్న ఫోటోలను గతంలో షేర్ చేసిన లలిత్ మోదీ.. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోలను డిలీట్ చేశాడు. త్వరలో పెళ్లి చేసుకోబోనున్నట్లు చెప్పిన లలిత్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తలేదు. ఇన్స్టాలో సుస్మితా సేన్ ఫోటోను తీసేశాడు. అంతేకాదు ఇన్స్టా డీపీ, బయోను లలిత్ మార్చేశాడు. దాంట్లో సుస్మితా ఫోటో కానీ, సమాచారం కానీ లేదు. దీంతో బహూశా ఇద్దరూ బ్రేకప్ అయి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.