వరుసగా ఐదు పరాజయాలతో విసిగిపోయి.. విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న కోల్కతా నైట్రైడర్స్కు అత్సవసర గెలుపు దక్కింది. మితిమీరిన మార్పులతో జట్టులో ఆత్మైస్థెర్యం లోపించిన తరుణంలో నైట్రైడర్స్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. సోమవారం జరిగినలో స్కోరింగ్ మ్యాచ్లో రాజస్థాన్పై కోల్కతా పైచేయి సాధించింది.మొదట బౌలింగ్లో సౌథీ, ఉమేశ్ రాణిస్తే.. ఆనక బ్యాటింగ్లో నితీశ్ రాణా, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్ నిలకడ కనబర్చడంతో కోల్కతా సునాయాసంగా విజయ తీరాలకు చేరింది.
ముంబై: లో స్కోరింగ్ గేమ్లో చివరి వరకు పట్టుదల కనబర్చిన కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-15వ సీజన్లో నాలుగో విజయం నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ (49 బంతుల్లో 54; 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్సెంచరీతో ఆకట్టుకోగా.. హెట్మైర్ (13 బంతుల్లో 27 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టాడు.
కోల్కతా బౌలర్లలో సౌథీ రెండు, ఉమేశ్, శివమ్, అనుకూల్ రాయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్కతా 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసింది. నితీశ్ రాణా (48 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రింకూ సింగ్ (23 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన తలా ఒక వికెట్ పడగొట్టారు.
వరుసగా విఫలమవుతున్న వెంకటేశ్ అయ్యర్ను తప్పించిన కోల్కతా ఫ్రాంచైజీ.. అతడి స్థానంలో అనుకూల్ రాయ్కు తుదిజట్టులో అవకాశమచ్చింది. గత సీజన్లో తన అద్వితీయ ప్రదర్శనతో జట్టును ఫైనల్ చేర్చిన వెంకటేశ్ అయ్యర్ ఈసారి బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ విఫలమవుతున్న విషయం తెలిసిందే. రింకూ సింగ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా మంగళవారం గుజరాత్తో పంజాబ్ తలపడనుంది.
రాజస్థాన్: 20 ఓవర్లలో 152/5 (శాంసన్ 54, హెట్మైర్ 27 నాటౌట్; సౌథీ 2/46, ఉమేశ్ 1/24), కోల్కతా: 19.1 ఓవర్లలో 158/3 (నితీశ్ 48 నాటౌట్, రింకూ సింగ్ 42; బౌల్ట్ 1/25, కుల్దీప్సేన్ 1/28).