తపాలా శాఖ ప్రవేశపెట్టిన కిసాన్ వికాస్ పత్ర.. కచ్చితమైన రాబడి హామీనిచ్చే పథకం. పొదుపు చేసిన మొత్తానికి కేంద్రం హామీగా ఉంటుంది. ఇటీవల చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం మార్పు చేయలేదు. దీంతో 124 నెలల్లో పొదుపు చేసిన మొత్తం ఈ పథకంలో రెట్టింపు అవుతుంది. ఇందులో కనీసంగా రూ.1,000 నుంచి ఎంత మొత్తాన్నైనా మదుపు చేయవచ్చు. దీనిపై 6.9 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ కిసాన్ వికాస్ పత్రను ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసుకునే అవకాశం కూడా ఉన్నది. మధ్యలో వడ్డీరేట్లలో మార్పులు వచ్చినా సరే.. ఒకసారి కొనుగోలు చేసిన దానిపై వడ్డీ మార్పు ప్రభావం ఉండదు. రిస్క్ అసలే వద్దనుకునేవారికి ఇదొక ఉత్తమ పొదుపు సాధనం.