కల్యాణ్దేవ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కిన్నెరసాని’.రమణతేజ దర్శకుడు. రజనీ తాళ్లూరి, రవి చింతల నిర్మాతలు. జనవరి 26న ప్రేక్షకులముందుకురానుంది. గురువారం ట్రైలర్ను విడుదల చేశారు. ‘నీ ముందు ఉన్న సముద్రపు అలల్ని చూడు..కోపగించుకొని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయ్..కానీ సముద్రం వాటిని వదలదు..వదులుకోలేదు..నేను కూడా అంతే..’ అని కథానాయిక శీతల్ చెప్పే డైలాగ్తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘అందమైన ప్రేమకథా చిత్రమిది. మిస్టరీతో సస్పెన్స్ను పంచుతుంది. కల్యాణ్దేవ్ పాత్ర చిత్రణ వినూత్నంగా ఉంటుంది. సహజమైన ఉద్వేగాల్ని ప్రతిబింబిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది’అని చెప్పారు. సినిమాలో ఐదు కథలుంటాయని, హృదయానికి హత్తుకునే ఎమోషన్స్ ఉంటాయని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు.