‘సఖి ఓ పల్లెటూరి అమ్మాయి. షూటింగ్ అంటే ప్రాణం. ఆ క్రీడలో జాతీయస్థాయిలో రాణించాలని కలలు కంటుంది. కఠోర సాధనతో తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలు ఏమిటన్నదే మా సినిమా కథ’ అన్నారు నగేష్ కుకునూర్. ఆయన దర్శకత్వంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గుడ్లక్ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కీర్తి సురేష్ షూటర్గా కనిపిస్తుంది. ఓ యువతి స్ఫూర్తివంతమైన ప్రయాణానికి దృశ్యరూపమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చిరంతన్ దాస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్, సమర్పణ: దిల్రాజు, దర్శకత్వం: నగేష్ కుకునూర్.