సిమ్లా : లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మండి నుంచి తన నామినేషన్ను కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదని కంగనా రనౌత్ అన్నారు.
కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేయడం ప్రారంభించారు..వారి నేత రాహుల్ గాంధీ హిందువుల్లో శక్తిని ధ్వంసం చేయడం గురించి మాట్లాడతారని ఆమె ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ప్రతినిధి మండి మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని కంగనా రనౌత్ దుయ్యబట్టారు. మండికి రిషి మాధవ్ పేరు పెట్టారని, ఋషి పరాశరుడు తపస్సులో కూర్చున్న ప్రదేశం మండి అని అంతటి పవిత్ర ప్రదేశం ఈ ప్రాంతమని కంగనా పేర్కొన్నారు.
మండిలో ఏటా మహాశివరాత్రి నాడు అతిపెద్ద మేళా నిర్వహిస్తారని, అలాంటి ప్రాంత మహిళలపై కాంగ్రెస్ నేతలు అమర్యాదకరంగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. చౌకబారు నేతల నుంచి ఇంతకన్నా మనం ఏం ఆశించగలమని బాలీవుడ్ క్వీన్ ప్రశ్నించారు.
Read More :
Tripti Dimri | యానిమల్లో జోయా పాత్ర సక్సెస్కు కారణమదేనంటున్న తృప్తి డిమ్రి