న్యూఢిల్లీ: రానున్న మేజర్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని హాకీ ఇండియా(హెచ్ఐ) పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. జూనియర్ క్యాంప్ కోసం హాకీ ఇండియా ఆదివారం 33 మందితో ప్రాబబుల్స్ను ప్రకటించింది. గత కొన్ని నెలలుగా నిలకడగా రాణిస్తున్న రాష్ర్టానికి చెందిన యువ ప్లేయర్ ఈదుల జ్యోతిరెడ్డి జట్టులో స్థానం దక్కించుకుంది. బెంగళూరులోని భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) కేంద్రంలో ఎంపికైన ప్లేయర్లంతా మూడు వారాల పాటు శిక్షణ పొందనున్నారు. ఎంపికపై జట్టు చీఫ్ కోచ్ జానెకె స్కాఫ్మన్ స్పందిస్తూ ‘దేశవాళీ టోర్నీల ద్వారా మెరుగైన ప్రతిభ కనబరిచిన ప్లేయర్లను శిబిరానికి ఎంపిక చేశాం. ఈ ఏడాది జరిగే ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచకప్తో పాటు పలు కీలక టోర్నీలను దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లను తీసుకున్నాం’ అని అన్నాడు.