లండన్: మాజీ భార్య అంబర్ హెర్డ్పై కేసు గెలిచిన ఆనందాన్ని ఫుల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు జానీ డెప్. ఇంగ్లండ్లోనే ఉంటున్న జానీ డెప్.. బర్మింగ్హామ్లో ఉన్న వారణాసి రెస్టారెంట్లో తన ఫ్రెండ్స్కు పార్టీ ఇచ్చారు. భారతీయ రుచులతో కూడిన డిన్నర్ కోసం జానీ డెప్ సుమారు 48.1 లక్షలు ఖర్చు చేశారు. ఇటీవల పరువునష్టం కేసులో వర్జీనియా కోర్టు జానీడెప్కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఫ్రెండ్స్కు ఇచ్చిన పార్టీలో భారతీయ వంటకాలను జానీ డెప్ ప్రిఫర్ చేశారు. వారణాసి రెస్టారెంట్లో కాక్టెయిల్స్, రోజ్ చాంపేన్తోనూ పార్టీ జరుపుకున్నారు. బర్మింగ్హామ్లోనే వారణాసి రెస్టారెంట్ అతిపెద్ద ఇండియన్ హోటల్. ఆ రెస్టారెంట్లో సుమారు 400 మంది కూర్చునే వీలుంటుంది. ఆదివారం రోజున ఈ డిన్నర్ వేడుక జరిగినట్లు వారణాసి రెస్టారెంట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మహ్మద్ హుస్సేన్ తెలిపారు.