పానిండియా బ్లాక్బస్టర్ ‘హను-మాన్’కి సీక్వెల్గా వస్తున్న మైథలాజికల్ అడ్వెంచర్ ‘జై హనుమాన్’. సప్త చిరంజీవుల మేళవింపుతో కూడిన కథాంశంతో హాలీవుడ్ ‘అవెంజర్స్’ని తలపించేలా దర్శకుడు ప్రశాంత్వర్మ తెరకెక్కిస్తున్న ఈ వెండితెర అద్భుతానికి కథానాయకుడు ‘కాంతార’ఫేం రిషబ్శెట్టి. ఇందులో ఆయన వీరాంజనేయుడిగా కనిపించబోతున్నారు. రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషించనున్నారు. ఆ పాత్ర వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచింది. ఇక శుక్రచార్యుడిగా అక్షయ్ఖన్నా.. ఇలా వివిధ పాత్రల్లో దేశంలోని పేరెన్నికగన్న తారలంతా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ని పూర్తిచేసుకున్నది. మలి షెడ్యూల్ బుధవారం నుంచి మొదలైంది. రిషబ్శెట్టి, రానా, అక్షయ్ఖన్నాలపై కీలక సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్వర్మ తెరకెక్కిస్తున్నారు. రాముడికిచ్చిన మాట కోసం హనుమంతుడు చేసిన యుద్ధమే ఈ సినిమా అని ఇన్సైడ్ టాక్. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈచిత్రానికి సంగీతం: గౌర హరి.