ముంబై, నవంబర్ 25: భారత సముద్ర తీర ప్రాంత భద్రత మరింత బలోపేతం కానున్నది. మరో ఆధునిక జలాంతర్గామి నేవీ అమ్ములపొదిలో చేరింది. ‘ఐఎన్ఎస్ వేలా’ సబ్మెరైన్ గురువారం ముంబై సముద్ర తీరంలో విధుల్లోకి చేరింది. భారత్కు ఉన్న స్టెల్త్ స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాముల్లో ఇది నాలుగోది. అదేవిధంగా ప్రాజెక్టు 75 పేరుతో నిర్మిస్తున్న సబ్మెరైన్ల్లో కూడా నాలుగోది. దీన్ని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) నిర్మించింది. ప్రాజెక్టు-75 కింద ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖంధేరి, ఐఎన్ఎస్ కరంజ్లను ప్రవేశపెట్టారు.
ప్రత్యేకతలు
ఆధునిక టార్పిడోలు, యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం
8 మంది అధికారులు, 35 మంది సిబ్బంది ఉంటారు
డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్తో పనిచేస్తుంది
సముద్ర గర్భంలో రహస్యంగా శత్రువులను గుర్తించి లక్ష్యాలను చేధిస్తుంది.