న్యూఢిల్లీ: 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదలతో వచ్చే రెండు దశాబ్ధాల్లో పలు వాతావరణ అనివార్య విపత్తులు సంభవించే అవకాశం ఉన్నదని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్గవర్న్మెంటల్ ప్యానెల్ ఆన్ ైక్లెమేట్ ఛేంజ్(ఐపీసీసీ) తాజా నివేదిక హెచ్చరించింది. పైన పేర్కొన్న గ్లోబల్ వార్మింగ్ స్థాయిని కూడా తాత్కాలికంగా మించిపోయే పరిస్థితి వస్తుందని, ఇది అదనపు తీవ్ర ప్రభావాలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు ఇందులో పేర్కొన్నారు. మానవ ప్రేరిత వాతావరణ మార్పులు ప్రకృతిలో ప్రమాదకరమైన, విస్తృతమైన అంతరాలను కలిగిస్తుందని, ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందలాది కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతుందని వివరించారు. విపత్కర పరిణామాలకు ఈ నివేదిక ఒక హెచ్చరిక వంటిదని ైక్లెమేట్ ఛేంజ్-2022 రిపోర్టును విడుదల చేస్తూ ఐపీసీసీ చైర్పర్సన్ హోసంగ్ లీ పేర్కొన్నారు.