Volcano Eruption : ఇండోనేషియా (Indonesia) లోని అనక్ క్రాకటౌ (Anak Krakatau) అగ్నిపర్వతం (Volcano) ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది. దాని నుంచి దాదాపు 50 వేల అడుగుల ఎత్తుకు మందపాటి బూడిద ఎగసిపడి సమీప గ్రామాలను కప్పివేసింది. ఈ అగ్నిపర్వతం శుక్రవారం నుంచి క్రియాశీలంగా ఉన్నట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు పేర్కొన్నారు.
దాంతో వెంటనే స్థానిక గ్రామాలను ఖాళీ చేయించామని, పర్వతారోహకులకు, సందర్శకులకు అనుమతి నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని చెప్పారు. పర్వతం నుంచి బూడిద భారీగా ఎగసిపడుతుండడంతో సుకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని సర్వీసులను రద్దు చేసినట్లు ఇండోనేషియా పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వెల్లడించారు.
అగ్నిపర్వతం బద్ధలు కావడంతో 209 విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 22,800 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది.
A breathtaking view of Indonesia’s Mount Semeru volcano erupting, with a towering ash plume rising above the landscape pic.twitter.com/jwu69qrBjh
— Surajit (@surajit_ghosh2) September 5, 2026