న్యూఢిల్లీ: వాహనాల్లో ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ప్రమాణాలను కఠినతరం చేసేందుకు విధించిన గడువు మరోమారు పొడిగించేందుకు కేంద్రం నిరాకరించింది. కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల తయారీలో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.
కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ లేదా హైబ్రీడ్ టెక్నాలజీలతో వాహనాలను తయారు చేయాల్సిన బాధ్యత ఆటోమొబైల్ సంస్థలదే. ఈ విషయమై గడువు పొడిగించాలని కార్ల తయారీ సంస్థలు చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. అయితే, క్లీన్ టెక్నాలజీని ఉపయోగించే కార్ల తయారీ సంస్థలకు కొన్ని రాయితీలు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
కానీ క్లీన్ టెక్నాలజీ నిబంధనల అమలును కనీసం రెండేండ్లు వాయిదా వేయాలని కేంద్రాన్ని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) కోరుతున్నది. సియామ్లో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ కో తదితర కార్ల తయారీ సంస్థలకు సభ్యత్వం ఉంది.
ఇప్పటికే క్లీన్ టెక్నాలజీని కార్ల తయారీలో ఉపయోగించేందుకు తొలిదశ నిబంధనలను 2017 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నది. అయితే, ఈ నిబంధనలను అమలు చేయడానికి 2022 మార్చి నెలాఖరు వరకు కార్ల తయారీ సంస్థలకు కేంద్రం గడువు ఇచ్చింది. కానీ క్లీన్ టెక్నాలజీ నిబంధనలను కఠినతరంగా అమలు చేయాలంటే తాము మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉందని కార్ల తయారీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
2019లో ఆర్థిక మాంద్యం వల్ల, 2020లో కరోనా మహమ్మారి ప్రభావంతో కార్ల విక్రయాలు 30 శాతం పడిపోయాయి. అయినప్పటికీ ఇంధన దిగుమతి బిల్లులో కోత విధించడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి సదరు నిబంధన అమలుకే కేంద్రం పట్టుదలగా ఉంది.
మా వాదనే నిజమైంది.. సుప్రీం తీర్పుపై రతన్ టాటా!
ధరలకనుగుణంగా ముడి చమురు దిగుమతి పాలసీ: ధర్మేంద్ర ప్రధాన్
స్క్రాపేజీ పాలసీ అమలు కష్టమే.. మారుతి ఈడీ శ్రీవాత్సవ
రిలయన్స్-ఆరామ్కో డీల్ మరింత జాప్యం.. ఎందుకంటే!