India vs Ireland : ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక, క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లుగా ఈ మ్యాచులో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం లేదు. ఈ మ్యాచ్ తుది జట్టులో కూడా అతడికి చోటు దక్కలేదు. అయితే, మరో ఇద్దరు ఆటగాళ్లు ఈ టీ20 ద్వారా అంతర్జాతీయ మ్యాచుల్లోకి అరంగేట్రం చేస్తున్నారు.
ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గేలు ఈ మ్యాచ్ ద్వారా ఇండియా తరఫున అరంగేట్రం చేయబోతున్నారు. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇది రెండు మ్యాచుల టీ20 సిరీస్. మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ అద్భుత విజయం సాధించి, భారత్కు షాకిచ్చింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు ఈ ఓటమి పెద్ద షాక్. దీంతో రెండు మ్యాచులో కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో పసికూనగా భావించే ఐర్లాండ్ను గట్టి దెబ్బ తీయాలని ఇండియా లక్ష్యంగా ఎంచుకుంది.
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాన్స్ షెడ్గె, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.