కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడు. కోమలీ ప్రసాద్, సువేక్ష కథానాయికలు. ఈ చిత్రం మార్చి 4న విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘రేచీకటి నేపథ్యంలో సాగే కథాంశమిది. రేచీకటితో సతమతమయ్యే కథానాయకుడికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. తనకున్న ఇంద్రియ వైకల్యం వల్ల అతను ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడన్నది ఆద్యంత ఆసక్తికరంగా అనిపిస్తుంది. జిబ్రాన్ స్వరరచనలో ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అని చెప్పారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణి రఘువరన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ కె నల్లి, నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్రా రెడ్డి, ప్రమోద్, రాజు, నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్, కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.