కొండాపూర్, ఫిబ్రవరి 14: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) ప్రొఫెసర్ల పరిశోధన అంశాలు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకేఎస్) ఫండింగ్కు ఎంపికైనట్టు వర్సిటీ యాజమాన్యం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సంస్కృతి స్టడీస్ అండ్ రిసెర్చ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ అంబ కులకర్ణి, సెంటర్ ఫర్ ఐప్లెడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ ప్రొఫెసర్ పరమేశ్వరి కృష్ణమూర్తి ప్రతిపాదించిన ‘సంస్కృతి వర్డ్ ఆర్డర్ ఫాలోయింగ్ ది స్టెప్స్ ఆఫ్ టార్గెట్ ల్యాంగ్వేజ్’, ‘సంస్కృతి టు ఇండియన్ ల్యాంగ్వేజ్ మెషిన్ ట్రాన్స్లేషన్ కం ల్యాంగ్వేజ్ యాక్సెసర్’ పరిశోధన అంశాలు ఏఐసీటీఈ ఐకేఎస్ ఫండింగ్కు ఎంపికైనట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 156 పరిశోధన అంశాలు ఫండింగ్కు దరఖాస్తు చేసుకోగా కేవలం 15 మాత్రమే ఎంపికయ్యాయని వెల్లడించింది. ఒక్కో అంశానికి రెండేండ్ల కాలపరిమితికి రూ.10 లక్షల నిధులు అందించనున్నట్టు హెచ్సీయూ తెలిపింది.