ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికైన లోహ శాస్త్రవేత్త
ముషీరాబాద్, నవంబర్ 1: కేంద్ర అణు ఇంధన సంస్థలో సీనియర్ శాస్త్రవేత్త్తగా పనిచేస్తున్న ఎమ్ఎన్వీ విశ్వనాథ్ను ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. విశేష పరిశోధనలు చేసిన వ్యక్తులకు ఇచ్చే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ (ఐఐఎం) జాతీయ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికిగాను పరిశోధనా రంగంలో జాతీయ విశేష సేవా పురస్కారం విశ్వనాథ్కు అందించనున్నట్టు ఐఐఎం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో విశ్వనాథ్ పురస్కారాన్ని అందుకోనున్నారు. లోహ శాస్త్రవేత్తగా విశ్వనాథ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. విశ్వనాథ్ అణు ఇంధన సంస్థలో సీనియర్ శాస్త్రవేత్తగా విశేషమైన సేవంలందించడంతోపాటు ఐఐఎం, ఐఎస్ఎన్టీలో సేవలందించారు.