హైదరాబాద్, ఆట ప్రతినిధి: మస్కట్ వేదికగా జరిగిన డబ్ల్యూటీటీ యూత్ కంటెండర్ టోర్నీలో తెలంగాణ యువ ప్యాడ్లర్ వరుణ్ శంకర్ మూడో స్థానంలో నిలిచాడు. అండర్-19 విభాగంలో ప్రస్తుతం దేశంలో మూడో ర్యాంక్ ప్లేయర్గా కొనసాగుతున్న శంకర్…మస్కట్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. క్వార్టర్స్లో శంకర్ 3-0 తేడాతో అండ్రెవా జనాదిత్(శ్రీలంక)పై అలవోకగా విజయం సాధించాడు. అయితే సెమీస్లో భారత్కే చెందిన టైటిల్ విన్నర్ పయాస్ జైన్ చేతిలో 2-3తో శంకర్ పోరాడి ఓడాడు. ఓవైపు మోకాలి గాయం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నా..పంటి బిగువన నొప్పిని భరిస్తూ..సెమీస్లో గెలుపు కోసం కడదాకా పోరాడాడు. తొలుత ప్రత్యర్థికి రెండు గేమ్లు చేజార్చుకున్న శంకర్..పుంజుకొని వరుసగా గేమ్లను కైవసం చేసుకున్నాడు. నిర్ణయాత్మక ఐదో గేమ్లో నొప్పి తీవ్రమవడంతో..మ్యాచ్ను కోల్పోయాడు. ఇదిలా ఉంటే ప్రస్తుత ర్యాంకింగ్స్ దృష్ట్యా నవంబర్లో జరిగే స్లోవేకియా, హంగరీ టోర్నీల్లో భారత్ తరఫున శంకర్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.