అమరావతి,జులై:దేశ రక్షణ కోసం జస్వంత్ త్యాగం మరవలేనిదన్నారు ఏపీహోంమంత్రి సుచరిత. అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని,దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చి ఆ తల్లిదండ్రుల జన్మ చరితార్థమని కొనియాడారు. ఉగ్రవాదులపోరులో వీర మరణం పొందిన జస్వంత్ రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత నివాళులర్పించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జస్వంత్ కుటుంబసభ్యులకు ప్రభుత్వ తరపున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. తమ్ముళ్ల కోసం జస్వంత్ నిరంతరం ఆలోచించేవాడని,వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జస్వంత్ కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.