హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికరణ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించకపోవడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్లకు హైకోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 7న వారు కోర్టుకు హాజరయ్యేలా వారెంట్లు అమలు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. భూసేకరణ పరిహారానికి సంబంధించిన కేసులో కింది కోర్టు నిర్ణయించిన మొత్తంలో 50% సొమ్మును 3 నెలల్లోగా డిపాజిట్ చేయాలని నిరుడు ఏప్రిల్ 24న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ ఆదేశాలు అమలు కాలేదంటూ జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన నాగిరెడ్డి, మరొకరు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలు చేయడంతో నిరుడు ఆగస్టు 22న సందీప్కుమార్ సుల్తానియా, వికాస్రాజ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ పరిహారం సొమ్మును డిపాజిట్ చేయకపోవడంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని, కోర్టు ధికరణ నేరం కింద ఎందుకు చర్యలు చేపట్టకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ వారికి ఫారం-1 నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కూడా వారు విచారణకు హాజరు కాకపోవడంతో బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.