బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) విజయ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. లీగ్ దశలోదుమ్మురేపిన హెచ్ఎఫ్సీ కీలకమైన సెమీఫైనల్లోనూ అదరగొట్టింది. శనివారం జరిగిన తొలి సెమీస్లో హెచ్ఎఫ్సీ 3-1 తేడాతో ఏటీకే మోహన్బగాన్పై ఘన విజయం సాధించింది. హెచ్ఎఫ్సీ తరఫున ఓగ్బాచె (45ని), యాసిర్ (58ని), సివేరియో (64ని) గోల్స్ చేశారు. మరోవైపు ఏటీకే జట్టుకు రాయ్ కృష్ణ (18ని) ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో రెండు గోల్స్ ఆధిక్యంలో నిలిచిన హెచ్ఎఫ్సీ ఈనెల 16న మరోమారు ఏటీకేతో సెమీస్లో తలపడనుంది.