
ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనగానే చాలామంది ఇడ్లీ, దోశ, వడ.. ఇలా రకరకాల టిఫిన్లు చేసుకుని తింటుంటారు. కొందరైతే కేకులు, చక్కెరతో చేసిన ఆహారపదార్థాలు తింటుంటారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పరిగడుపున తియ్యటి వస్తువులు తినడం వల్ల అజీర్తి సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. అందుకే వాటికి దూరంగా ఉండాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇవే కాదు ఉదయాన్నే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా ఉదయంపూట అదీ పరిగడుపున సిట్రస్పండ్లను తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల అల్సర్, గ్యాస్ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ఉదయంపూట ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఉప్పు, కారం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు.

ఆయిల్ఫుడ్ తీసుకుంటే కడుపులో గ్యాస్ఫామ్ అవుతుంది. నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే ఛాతిలో మంట, ఉదర సంబంధిత రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది.

కార్బోహైడ్రేట్లు ఉన్న పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. సోడా, కూల్డ్రింక్స్ను ఉదయం పూట తీసుకోకూడదు. ఇకపోతే టమాటాలను కూడా పరిగడుపున తినకూడదు. ఇందులో టానిక్ యాసిడ్ ఉండడంతో పరిగడుపున తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పరిగడుపున స్వీట్లు తినడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు అధికంగా ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి వాడిన మందారపూలతో ఔషధ టీ తయారుచేస్తారు. ఈ పువ్వులోని ఆకరషణ పత్రాలను నీటిలో బాగా కడిగి ముందుగా మరగపెట్టిన పాలలో వేసి వాటి రంగు మారేవరకు వేచి ఉండి అప్పుడు తాగాలి. దీంతో అందులోని పలురకాల పోషక పదార్థాలు, అధిక శాతం ఐరన్, విటమిన్లు మేలు చేస్తాయి. టీ తాగితే హైపర్ టెన్షన్ తగ్గుతుంది.
RELATED GALLERY
-
Siddharth | కొత్త తరహా లవర్ బాయ్ పాత్రలో సిద్ధార్థ్..
-
Agent Movie | ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఏజెంట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Golden Temple | ఆపరేషన్ బ్లూ స్టార్.. గోల్డెన్ టెంపుల్ వద్ద భద్రత కట్టుదిట్టం
-
Minister KTR | యాద్రాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. హ్యాండ్లూమ్ మోడ్రన్ సేల్స్ షోరూమ్కి భూమిపూజ
-
Bhola shankar Movie | బాస్ రేంజ్ మాములుగా లేదుగా.. భోళా శంకర్ సినిమాకు కోట్లల్లో బిజినెస్?
-
JEE Advanced | జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్.. వాట్సాప్ గ్రూప్లో ఆన్సర్స్ షేర్ చేసిన విద్యార్థి